AletheiAnveshana: వాక్య ధ్యానాoశము
Showing posts with label వాక్య ధ్యానాoశము. Show all posts
Showing posts with label వాక్య ధ్యానాoశము. Show all posts

Wednesday, 31 December 2025

నూతన సంవత్సర శుభాకాంక్షలు.

 

దేవుడు మరియు మానవుని తల్లి

నిత్య రక్షణకు  క్షయమైన ఈ శరీరం ఒక అక్షయమైన శరీరాన్ని ధరించుకోవాలి (A)

 

నేడు కృతజ్ఞతగా, కన్యమరియ మాతృత్వాన్ని మాతృ శ్రీసభ మనందరికీ ఒక నమూనాగా ప్రతిబింబి౦పచేస్తుంది. ఎఫెసుస్ కౌన్సిల్ (క్రీ.శ 451)లో, యేసు తల్లి తన కుమారుడైన యేసుక్రీస్తు దైవత్వాన్ని అంగీకరిస్తూ ఆమె దేవుని తల్లి లేదా “థియోటోకోస్” (గ్రీకు) అని గంభీర౦గా  ప్రకటన చేసింది. ఈ గొప్ప బిరుదుతో, ఆమెను ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చాలా మంది క్రైస్తవులు గౌరవిస్తారు. 16 వ బెనెడిక్ట్ పోపు గారు, “యేసు దేవుని కుమారుడు, అదే సమయంలో ఆయన ఒక స్త్రీ మరియ కుమారుడు. ఆయన ఆమె నుండి ఉదయించాడు. ఆయన దేవునికి మరియు మరియకు చెందినవాడు” అని అన్నారు. ఆమె దైవ కృపను విశ్వసించింది. అందుచే  దేవుని మంచితనంలో ఆమె శాశ్వితంగా నిలబెట్టబడింది. నిజానికి, ఆమె ప్రభువు “అనావిమ్‌” (హిబ్రూ పదం – బీదవారు/సాత్వికులు). విశ్వంలోని ప్రతీది దేవుని చేతిలోనే నియంత్రించబడి వుందని విశ్వసించే వినయపూర్వకమైన హృదయాలుగా నిలిచే వాళ్ళే ఈ సాత్వికులు (లూమెన్ జెంత్సియుం 55). అయితే పునీత అగస్టీనుగారు కన్య మరియ గురించి వ్రాస్తూ, “ఆమె యేసును తన గర్భంలో ధరింపచేయక ముందు తన హృదయంలో గర్భం ధరించింది” అని చక్కటి ధ్యాన వాక్యాన్ని అందించాడు.

 

ఈనాటి దివ్యార్చన  కొత్త సంవత్సరంలోని మన ఆశలను, ప్రణాళికలను కోసం ఆ తల్లి సంరక్షణలో ఉంచమని మనల్ని మాతృ సంఘం ఆహ్వానిస్తుంది. మన వ్యక్తిగత ఆందోళనలను, మన యుగంలోని ఆందోళనలను, సంఘర్షణలను, నిర్దిష్టమైన అన్యాయాలను, అసమాన సంపదను, అవకాశాలను, యుద్ధాలను, మన ప్రపంచంలో శాంతి మరియు న్యాయాన్ని ఇబ్బంది పెట్టే ప్రతిదాన్ని ఆమెకు అప్పగించవచ్చు. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మన కన్య మరియ మనకు మార్గదర్శకంగానూ సలహాదారుగానూ ఉంటుంది. ఆమె మనలో విశ్వాసాన్ని కలిగించాలని, మన తల్లిగా ఉండాలని కోరుకుంటుంది మాతృ సంఘం. అందుకే, యోహాను సువార్తలో, క్రీస్తు ప్రజా జీవితం ప్రారంభంలో మరియు చివరిలో ఆమె మనకు కన్పిస్తుంది.

 

కల్వరిలో మరియ ఉనికిని నమోదు చేసిన ఏకైక వ్యక్తి సువార్తికుడు యోహాను మాత్రమె - “యేసు సిలువ దగ్గర ఆయన తల్లి నిలబడింది” (యోహాను 19:25). ఇది నిర్ధారణ అని మనకు అర్ధమౌతుంది. యేసు చేసిన అద్భుతాలన్నీ చాలా మందికి భ్రమగా అనిపించినప్పటికీ, ఆయన తల్లి ఆతని చివరి శ్వాస వరకు ఆయనకు నమ్మకంగా నిలబడి, దేవుని రక్షణ శక్తిని నమ్మింది. సిమియోనుడు, “ఇశ్రాయేలులో అనేకుల పతనానికి, వారి పెరుగుదలకు ఆయన నియమితుడు, తిరస్కరించబడిన సూచనగా ఉండుటకు ఆయన నియమితుడు” ( 2:34) అని పలికిన మాటను జ్ఞాపకం చేసుకున్నది. ఆమెకు కలిగిన విశ్వాసానికి ఆశ్చర్యకరమైన అద్భుతాలు మనకు అవసరం లేదు, కానీ మన తండ్రి అయిన దేవుని మర్మమైన మార్గాలపై చిన్నపిల్లల విశ్వాసంలాంటి వైఖరి మనం కలిగి ఉండడంపై ఆధారపడి వున్నది. సువార్తికుడు యోహాను, “ఇదిగో మీ తల్లి” అని వ్రాసినట్లుగా, యేసు తల్లి ఇకనుండి ఆయన శిష్యులందరికీ తల్లి అవుతుంది కదా!! అందుకే తన బలమైన మరియు సరళమైన విశ్వాసాన్ని మనతో పంచుకుంటుంది.

 

“నేడు రక్షకుడు మీకు జన్మించాడు. ఆయన ప్రభువైన క్రీస్తు" (లూకా 2:24) అని గొర్రెల కాపరులు తనతో చెప్పిన దానిని ఆమె ఎంతో విలువైనదిగా భావించి, ధ్యానించింది. ఈ రోజు, నూతన సంవత్సర దినోత్సవం. చాలామంది మంచి తీర్మానాలు చేసుకోవడానికి ఆకర్షితులయ్యే రోజు. ఈ రోజు దేవుని కృప ముందు మరియ తల్లి వైఖరిని స్వీకరించడం కంటే మనం ఏలాంటి మంచి నూతన సంవత్సర తీర్మానం చేసుకోగలం? తన కుమారుడైన క్రీస్తులో మనకు తెలియజేయబడిన దేవుని దయగల ప్రేమ ముందు మరియమాత విస్మయం మరియు ఆశ్చర్య భావనలో పాలుపంచుకోవడానికి నేటి అర్చన మనల్ని ఆహ్వానిస్తుంది. కళంకము లేని నిత్య కన్య మరియ తల్లి  చేసినట్లుగా సువార్తను విలువైనదిగా పరిగణించడంలో సహాయం చేయమని మనం అడుగుదాము. తద్వారా క్రీస్తు తన మాతృ మూర్తి మరియ ద్వారా మన వద్దకు వచ్చినట్లే మన ద్వారా ఇతరుల దరికి వస్తాడు.

 

సమస్త జనులు ఆమె పిల్లలు అని పిలువబడతారు. అందుకే సర్వోన్నతుడు స్వయంగా ఆమెను స్థాపించాడు”.

Saturday, 27 December 2025

నజరేతు పవిత్ర కుటుంబ ఉదాహరణ

 


నజరేతు పవిత్ర కుటుంబ ఉదాహరణ

“....మీ తల్లిదండ్రులకు విధేయత చూపడం మీ క్రైస్తవ విధి. ఎందుకంటే అదే సరైన పని...” (A)

యేసు జీవితాన్ని మనం అర్థం చేసుకోవడం ప్రారంభించడానికి నజరేతు ఇల్లు ఒక పాఠశాల. అది సువార్త పాఠశాల. ఇక్కడ మనం నేర్చుకునే మొదటి పాఠం ఏమిటంటే, దేవుని కుమారుని సరళమైన, వినయ పూర్వకమైన, అందమైన మరియు మర్మమైన అభివ్యక్తి అర్థాన్ని చాలా లోతూగా ఒక సారి చూడటం, వినడం, ధ్యానం చేయడం మరియు చొచ్చుకుపోవడమే! బహుశః మనం ఈ అనుకరణ పాఠాన్ని అస్పష్టంగానూ నేర్చుకొ గలము!!!

నేను మళ్ళీ పిల్లవాడిని అయి, ఈ వినయపూర్వకమైన మరియు ఉన్నతమైన నజరేతు పాఠశాలకు మళ్ళీ వెళ్లడగలిగితే ఎంత సంతోషంగా వుంటుంది. మరియకు దగ్గరగా, జీవితపు నిజమైన శాస్త్రాన్ని మరియు దైవిక సత్యాల ఉన్నత జ్ఞానాన్ని నేర్చుకోవడంలో నేను కొత్తగా ప్రారంభించగలిగితే ఎంత బాగుంతుంది. కానీ నేను ఈ భూలోక తీర్ధ యాత్రికుడిని మాత్రమేగా!! సువార్తను అర్థం చేసుకోవడంలో నా  అసంపూర్ణమైన విద్యను ఈ ఇంట్లో కొనసాగించాలనే ఈ కోరికను నేను ఇక త్యజించాలి. తప్పదు. ఎందుకంటే ఇక ఇప్పుడు నేను చేయలేను.

మొదటగా, నిశ్శబ్దం (మౌన ధ్యానం) దాని పాఠం. నిశ్శబ్దం పట్ల గౌరవం. ఆ ప్రశంసనీయమైన మరియు అనివార్యమైన మానసిక స్థితి మనలో పునరుజ్జీవింపబడాలి. మన ఉప్పొంగి పోయే లేదా అతిగా సున్నితత్వం చెందిన ఆధునిక జీవితంలో బాగానే ఉద్ధరించే గందరగోళ స్వరాలు, సాధారణ శబ్ద కోలాహలాలలో మనం చుట్టుముట్టబడి కమ్మివేయబడి ఉన్నాము. నజరేతు నిశ్శబ్దం మనకు జ్ఞాపకశక్తి, అంతర్గతత, మంచి ప్రేరణలను మరియు నిజమైన గురువుల బోధనలను వినడానికి తగినంత వైఖరిని నేర్పుతుంది. ఇది ముందుచూపు గలిగిన తయారితనం, అధ్యయనం, ధ్యానం, వ్యక్తిగత అంతర్గత జీవితం, దేవుడు మాత్రమే రహస్యంగా చూసే ప్రార్థనా విలువను మనకు నేర్పుతుంది.

తరువాత, కుటుంబ జీవితం గురించిన ఒక పాఠం ఉంది. కుటుంబ జీవితం అంటే ఏమిటో, దాని ప్రేమ సహవాసం, దాని కఠినమైన, సరళమైన అందం, దాని పవిత్రమైన మరియు అవ్యక్తమైన లక్షణాన్ని నజరేతు పవిత్ర కుతుమబం మనకు నేర్పుతుంది. వారి ఇంట్లో పొందిన నిర్మాణం సున్నితమైనది మరియు భర్తీ చేయలేనిది అని నజరేతు నుండి నేర్చుకుందాం. సామాజిక క్రమంలో కుటుంబం పాత్ర ప్రధాన ప్రాముఖ్యతగా నేర్చుకుందాం.

చివరగా, పని పాఠం ఉంది. 'వడ్రంగి కుమారుని' నివాసమైన నజరేతును, నీలో చూస్తూ కఠినమైన మానవ పని, విమోచన చట్టాన్ని అర్థం చేసుకోవడానికి మరియు దానినే ప్రకటించడానికి నేను ఇష్టపడు తున్నాను. ఇక్కడ నేను పనిలో వున్న గొప్పతనం మరియు దాని అవగాహనను పునరుద్ధరిస్తాను. మరియు ఆ పని దానికదే ఒక ముగింపు కాదనీ, దాని స్వేచ్ఛ, దాని శ్రేష్ఠత దాని ఆర్థిక విలువ కంటే ఎక్కువగానూ, అది ఎవరి కోసం చేపట్టబడుతుందో వారి విలువ నుండి ఉద్భవించిందని పునరుద్ఘాటిస్తాను. ముగింపుగా, ఇక్కడ నజరేతులో,  ప్రపంచంలో వున్న ప్రతీ కార్మికుడిని నేను పలకరించాలనుకుంటున్నాను. వారి గొప్ప నమూనా మరియు వారి సోదరుడు దేవుడే అని వారికి నొక్కి చెబుతున్నాను.  వారి న్యాయమైన కారణాలన్నింటికీ ఆయనే ప్రవక్త, మన ప్రభువైన క్రీస్తు.

"మీరు ఏమి చేస్తున్నారో, మీ పూర్తి హృదయాన్ని దానిలో పెట్టండి..."

పోప్ పాల్ VI నజరేతులో ఇచ్చిన ప్రసంగం నుండి...

 

Wednesday, 24 December 2025

Merry Christmas. God bless you

 

యెష్షయి మొద్దు నుండి ఒక చిగురు పుట్టుకొచ్చింది

వాక్యం శరీరధారియై మన మధ్య జీవించింది. హల్లెలూయా (ఎ)

 

ప్రియులారా! నేడు మన రక్షకుడు జన్మించాడు. మనం ఆనందిద్దాం. జీవిత జన్మదినోత్సవంలో దుఃఖానికి స్థానం ఉండకూడదు. మరణ భయం మ్రింగివేయబడింది. జీవితం శాశ్వత ఆనందపు వాగ్దానంతో మనకు ఆనందాన్ని తెస్తుంది. ఈ ఆనందం నుండి ఎవరూ దూరంగా వుండలేరు. ఆనందించడానికి అందరూ ఒకే కారణాన్ని పంచుకుంటున్నారు. పాపం మరియు మరణంపై విజేత అయిన మన ప్రభువు, పాపం నుండి విముక్తి పొందిన వ్యక్తిని కనుగొనలేదు. కానీ మనందరినీ విడిపించడానికి వచ్చాడు. విజయ అరచేతిని చేతిలో చూసి సాధువు సంతోషించాలి. క్షమాపణ ప్రతిపాదనను అందుకున్నప్పుడు పాపి సంతోషించాలి. అన్యమతస్థుడు జీవితానికి పిలువబడినప్పుడు ధైర్యం పొందాలి.

 

దేవుని జ్ఞానపు అపారమైన లోతులలో ఎన్నుకోబడిన కాలము తన సంపూర్ణతలో, దేవుని కుమారుడు మన సాధారణ మానవత్వాన్ని దాని సృష్టికర్తతో సమన్వయపరచడానికి అ భారాన్ని తనపై వేసుకున్నాడు. మరణానికి మూలమైన అపవాదిని, మానవాళిని పడగొట్టిన ఆ అహంకార స్వభావాన్ని మట్టు పెట్టడానికి ఆయన వచ్చాడు. కాబట్టి మన ప్రభువు జనన సమయంలో దేవదూతలు ఆనందంతో, అత్యున్నతమైన దేవునికి మహిమ మరియు ప్రపంచంలోని అన్ని దేశాల నుండి స్వర్గపు జెరూసలేం నిర్మించబడటం చూసి వారు మంచి మనసున్న మనుష్యులకు శాంతిని ప్రకటిస్తారని గీతాలాపన చేశారు. దేవుని మంచితనమును చూపించే ఈ అద్భుతమైన పనిని చూసి ఉన్నత స్థానంలో ఉన్న దేవదూతల చాలా సంతోషించినప్పుడు, అది మానవుల వినయ హృదయాలకు అటువంటి ఆనందాన్ని కలిగించకూడదా?

 

ప్రియులారా! మన పాపాలలో మనం చనిపోయినప్పుడు, ఆయన మనపై గొప్ప ప్రేమతో జాలిపడి, క్రీస్తులో మనం నూతన సృష్టిగా ఉండేలా ఆయన మనల్ని క్రీస్తుతో బ్రతికించాడు. మన పాత స్వభావాన్ని, దాని మార్గాలన్నింటినీ వదిలేద్దాం మరియు మనం క్రీస్తులో జన్మించినట్లే, శరీర కార్యాలను త్యజిద్దాం. క్రైస్తవుడా! నీ గౌరవాన్ని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు నీవు దేవుని స్వభావాన్ని పంచుకున్నావు కాబట్టి పాపం ద్వారా నీ పూర్వపు నీచ స్థితికి తిరిగి రాకు. నీ శిరస్సు ఎవరో, ఎవరి శరీరపు సభ్యుడవో అని మీరు గుర్తుంచుకోండి. చీకటి శక్తి నుండి నీవు రక్షించబడి దేవుని రాజ్యపు వెలుగులోకి తీసుకురాబడ్డావని మర్చిపోకు. బాప్టిజం అనే దివ్య సంస్కారము ద్వారా నీవు పరిశుద్ధాత్మ ఆలయంగా మారావు. దుష్ట ప్రవర్తన ద్వారా అంత గొప్ప అతిథిని తరిమివేసి, మళ్ళీ అపవాదికి బానిసగా మారకు. ఎందుకంటే నీ స్వేచ్ఛ క్రీస్తు రక్తం ద్వారా కొనుగోలు చేయబడింది.

 

క్రైస్తవుడా! నీ గౌరవాన్ని గుర్తుంచుకో.

పునీత లియో ది గ్రేట్ ప్రసంగం నుండి తీసుకొనబడింది

Friday, 19 December 2025

నమ్మదగిన వాగ్దానాలకు పిలుపు యెషయా 7:10-14; రోమా 1:1-7; మత్తయి 1:18-24

 


నమ్మదగిన వాగ్దానాలకు పిలుపు  

యెషయా 7:10-14; రోమా 1:1-7; మత్తయి 1:18-24

గ్రహించలేనిది అర్థంకాని విధంగా పరిపూర్తి అయిందిపునీత ఆంబ్రోసు

అనిశ్చితి లేదా ప్రతికూలతను ఎదుర్కొoటున్న సమయాలలో మనం దేవుని వాగ్దానాలను గ్రహించి నమ్మగలమా? నిస్సహాయ పరిస్థితిలో ప్రవక్త యెషయా ఆశాదాయక ప్రవచనాలను అందిస్తున్నాడు. రాజు ఆహాజు (క్రీ.పూ.735) తనను మరియు తన ప్రజలను నాశనం చేయ బెదిరించే శక్తులు చుట్టుముట్టినప్పుడు... దావీదు మరియు అతని వారసులకు తాను చేసిన వాగ్దానపు భరోసాను దేవుడు ఒక సంకేత రూపంలో ఇచ్చి నట్లు గుర్తు తెచ్చుకున్నాడు . అయితే,  ఆహాజు రాజు దేవునిపై ఆశను కోల్పోయినప్పటికీ అనుగ్రహ సంకేతాన్ని అడగడానికి మాత్రం నిరాకరించాడు. అయినప్పటికీ, దేవుడు వారికి శాంతి మరియు నీతితో పరిపాలించే రక్షకుడిని నిజంగా ఇస్తానని హామీ ఇచ్చే ఒక సంకేతాన్ని ఇచ్చాడు (యెష 7:11..). ప్రవక్త యెషయా వలె, మనం కూడా తన వాగ్దానాలలో ఆశకు వ్యతిరేకంగా (రోమా 4:18) విశ్వసించాలని పులువ బడినాము.

దేవుని ఎడల తనకు వున్న విశ్వాసం నిమిత్తం మరియ తల్లి ఒక పెద్ద సవాలునే ఎదుర్కొంది. ఆమెను ఒక బృహత్తరమైన బాధ్యతను స్వీకరించమని అడిగాడు దేవుడు. సహజ తండ్రి లేకుండా బిడ్డ పుట్టవచ్చని ఇంతకు ముందు ఎప్పుడూ యూదు చరిత్రన వినబడలేదు!! ప్రకృతి నియమాలకు ఈ అద్భుతమైన మినహాయింపును అంగీకరించమని, ఆయన వాగ్దానాలపై నమ్మకం ఉంచమని మరియను కోరుకున్నాడు దేవుడు. ఆమెను ఈ గొప్ప సాహసం చేయమని అడిగాడు దేవుడు. యోసేపు మరియు ఆమె స్వంత ప్రజలందరూ ఈ విషయమై ఆమెను తిరస్కరించి ఉండేవారే. దేవుని నుండి ప్రత్యక్షత లేకుండా యోసేపు మరియు ఆమె కుటుంబం అర్థం చేసుకోలేరని మరియకు తెలుసు. అయినప్పటికీ ఆమె దేవుని వాగ్దానాలను నమ్మింది మరియు విశ్వసించింది.

దైవభక్తిగల యోసేపు, తన భార్య మరియ గర్భవతి అని తెలుసుకున్నప్పుడు ఆమెను శిక్షించడానికి ఇష్టపడలేదు. యోసేపు నిస్సందేహంగా ఈ బాధ కలిగించే విషయాన్ని ప్రార్థనలో దేవునికి తెలియజేశాడు. తీర్పు చెప్పడానికి లేదా బాధతో మరియు కోపంతో స్పందించడానికి అతను తొందరపడలేదు. దేవుడు అతనికి మార్గదర్శకత్వం మరియు ఓదార్పుతో మాత్రమే కాకుండా, అతను నిజంగానే మరియ భర్త అని పిలిచాడనీ,  మరియు దేవునిపై అత్యంత నమ్మకం అవసరమయ్యే ఒక లక్ష్యాన్ని చేపట్టాడని దైవిక హామీతో  ప్రతిఫలమిచ్చాడు. మరియను తన భార్యగా స్వీకరించి ఆమె గర్భంలో ఉన్న బిడ్డను వాగ్దత్త మెస్సీయగా అంగీకరించాలనే దైవిక సందేశాన్ని యోసేపు నమ్మాడు.

మరియవలే, యోసేపు కూడా మనకు విశ్వాసానికి ఒక నమూనా. ఆయన దేవుని విమోచన ప్రణాళికకు నమ్మకమైన సాక్షి మరియు సేవకుడు. గందరగోళ పరిస్థితులు మరియు అధిగమించలేని సమస్యలు ఎదురైనప్పుడు, దేవుని వాగ్దానాలను నమ్మడానికి మనం సిద్ధంగా ఉన్నామా? దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు, కానీ తన ఏకైక కుమారుడు, మన ప్రభువు మరియు రక్షకుడు అయిన యేసుక్రీస్తును మన ముందు ప్రత్యక్ష పరిచాడు. మనం క్రిస్టమసు మరియు సాక్షాత్కార పండుగలను ఆనందకరమైన హృదయంతో జరుపుకుందాం. దేవుని ఎడల, ఆయన విమోచన పనిలో మన విశ్వాసాన్ని మరియు దానిలోని ఆశను పునరుద్ధరించుకుందాం.

 

ఈ స్థితికి చేరుకోగలిగిన ఆత్మ ప్రభువు గొప్పతనాన్ని ప్రకటిస్తుంది” పునీత ఆంబ్రోసు

 

 

Friday, 12 December 2025

అనివార్యమైన ప్రబోధన లక్ష్యం యెష 35:1-6,10; యోహా 5:7-10; మత్త 11:2-11

 

అనివార్యమైన ప్రబోధన లక్ష్యం

యెష 35:1-6,10; యోహా 5:7-10; మత్త 11:2-11

యోహాను స్వరం మరియు క్రీస్తు వాక్కు 

ఆగమన కాలపు మూడవ ఆదివారం సాంప్రదాయకంగా “గౌదాతే” ఆదివారంగా  పిలువబడుతుంది. లతీను భాషా పదం “గౌదాతే” అంటే "ఆనందించండి" అని అర్థం. ఈ ఆదివారం గురువు సమర్పించే నేటి పూజా ప్రవేశ వచనంలోని (యాంటీఫోన్‌) మొదటి పదం "ఆనందించండి". కాబట్టి ఈ ఆదివారంను అలాంటి పేరున పిలువబడింది. సాధారణంగా పూజకు ముందు ప్రవేశ గీతమునకు బదులుగా ఇటువంటి ప్రవేశ వచనములను గురువు చెబుతారు. ప్రవేశ గీతములు సర్వ సాధారణమవ్వడం వల్ల ఇటువంటి మంచి వాక్యాలను మనం చాలా సమయాల్లో కోల్పో వలసివస్తుంది. ఈ ప్రవేశ వచనాలు వంద శాతం పరిశుద్ధ గ్రంధ వాక్యాలే!! నేటి “గౌదాతే” పదం కూడా పరిశుద్ద గ్రంధ వాక్యమే!! ఇది ఫిలిప్పీయులకు వ్రాయ బడిన పత్రిక 4:4-5 నుండి తీసుకోబడింది: "ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించండి; మళ్ళీ నేను చెప్తున్నాను, ఆనందించండి! ప్రభువు దగ్గరలో ఉన్నాడు" అని భక్త పౌలుడు తన ఫిలిప్పియ సంఘాన్ని ఉత్తేజ పరుస్తాడు. కొంతమంది ఈ ఆదివారం తమ ఆగమనకాలపు ఉట్టి (wreeth) లేదా ఆగమానపు పుష్ప గుచ్చమునకు పెట్టిన ఊదా రంగు కొవ్వొత్తికి బదులుగా గులాబీ రంగు కొవ్వొత్తితో గుర్తుంచుకుంటారు. ఇది కథోలిక కుటుంబ సంప్రదాయం. బహుశః మీ ఆలయాలలోనే మీరు ఈ తంతును చూసి వుంటారు. ఇళ్ళల్లోనికి చిన్నపాటి పశువుల పాక లేదా క్రిస్టమస్ Tree తప్ప ఈ wreeth సంప్రదాయ తంతు ఇంకా అంతగా చోటు చేసులోలేదు అనుకుంటాను. నేటి పఠనాలు  మనకు తెలియ చేస్తున్నట్లుగా దేవుని మహిమను సందర్శించడంలో మన రక్షణ కనుగొనబడుతుందని ఒక ఆనందకరమైన జ్ఞాపిక వుంటుంది ఈ ఆదివారం!

ఈరోజు గత ఆదివారం వలెనే తిరుసభ మనకు బాప్తిస్మ యోహాను మూర్తిని అందిస్తుంది. యోహాను తన జీవన విధానంలో మరియు సత్యం పట్ల తన విశ్వసనీయతలో దృఢమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. అందు వలన అతనికి జైలు శిక్ష మరియు బలిదానం ఒక వరమయ్యాయి. జైలు నుండి కూడా, అతను హేరోదుతో ప్రభావవంతంగా మాట్లాడాడు. తప్పును మరియు అధర్మాన్నిఖండించాడు. యోహాను  స్వభావ దృఢత్వాన్ని వినయంతో ఎలా ఏకం చేయాలో : “నా వెనుక వచ్చువాడు, ఆయన చెప్పుల పట్టీని విప్పుటకైనా నేను అర్హుడిని కాదు” (యోహా 1:27); “ఆయన హెచ్చింప బడాలి; నేను తగ్గింపు బడాలి” (యోహా 3:30) అన్న వాక్యంతో మనకు బోధిస్తున్నాడు.  తనకంటే ఎక్కువ మందికి యేసు బాప్తిస్మం ఇస్తున్నందుకు అతను సంతోషించాడు. ఎందుకంటే అతను తనను తాను “పెండ్లి కుమార్తె గాన్నూ, యేసు “ఉన్నవాడు”, పెండ్లికుమారుడు మరియు ఉత్తమ పురుషుడు” (యోహా 3:26) అని భావించాడు.

 మన భూలోక ప్రయాణాన్ని తీవ్రతరం చేసుకోమని  యోహాను మనకు బోధిస్తున్నాడు. దేవుని బిడ్డలుగా మన జీవితాలను గడపడంలో మనం త్రికరణంగా స్థిరమైన క్రైస్తవులుగా ఉండాలి. యోసేపు యేసుక్రీస్తు జననానికి ఎలా సిద్ధమై ఉండేవారు? యోహాను యేసు బోధనకు ఎలా సిద్ధం చేశాడు? వారి తయారీని పరిగణనలోకి మనం తీసుకుంటే, యేసు జననాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మరియు ఆయన రెండవ రాకడను స్వాగతించడానికి మనం ఎంతగా సిద్ధం కావాలో అర్ధ మవుతుంది. జెరూసలేం పునీత సిరిల్ : “మేము క్రీస్తు రాకను మాత్రమే కాదు, రెండవ రాకను కూడా ప్రకటిస్తున్నాము. ఇది మునుపటి రాక కంటే చాలా మహిమాన్వితమైనది. ఎందుకంటే మొదటిది తన సహనాన్ని చూపిస్తుంది, కానీ తరువాతిది దానితో దైవిక రాజ్యపు కిరీటాన్ని తెస్తుంది” అని అంటున్నాడు.

“ ‘యోహాను బంధించబడిన తరువాత, యేసు గలిలయకు వచ్చి దేవుని సువార్తను ప్రకటిస్తూ, ‘సమయం పూర్తయింది, దేవుని రాజ్యం దగ్గరపడింది: పశ్చాత్తాపపడి సువార్తను నమ్మండి’ (మార్కు 1:14-15) అని  అన్నాడు. సువార్తికుడు మార్కు వచనాన్ని ఉటంకిస్తూ, కథోలిక సంఘం తన సత్యోపదేశ సంక్షేమ బోధన  (541), ‘తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, మరియు భూమిపై పరలోక రాజ్యాన్ని క్రీస్తుప్రారంభించాలని’ బోధిస్తుంది. ఇప్పుడు తండ్రి తన చిత్తం ‘తన స్వంత దైవిక జీవితంలో పాలుపంచుకోవడానికి మనల్ని ఉత్తేజపరుస్తుంది’. ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు వైపు మనల్ని ఆకర్షించడం ద్వారా ఈ పనిని పరిపూర్తి చేస్తున్నాడు. సంఘంగా మరియు రక్షణ పొందుకున్న క్రైస్తావునిగా ఆ  సువార్తను ప్రకటించే ధైర్య లక్ష్యo మనకు  ఉందా???

 

ప్రభువు ఆలస్యం చేయకుండా వస్తాడు. చీకటి దాచిపెట్టిన దానిని ఆయన వెలుగులోకి తీసుకోస్తాడు.”

 

Friday, 5 December 2025

పరిశుద్ధుడు మరియు సత్యవంతుడు వచ్చుచున్నాడు యేష 11:1-10; రోమా 15:4-9; మత్త 3:1-12

 

పరిశుద్ధుడు మరియు సత్యవంతుడు వచ్చుచున్నాడు

యేష 11:1-10; రోమా 15:4-9; మత్త 3:1-12

గొప్ప రాజు వచ్చినప్పుడు, మనుష్యుల హృదయాలు పవిత్రం చేయబడతాయి.”

 

మన రక్షణ పట్ల ఆమెకున్న శ్రద్ధలో, మన ప్రేమగల మాతృ శ్రీసభ, మనం పొందుకున్న ఆశీర్వాదం నిమిత్తమై  కృతజ్ఞతతో ఉండటానికి మరియు క్రీస్తు రెండవ రాకడకు సిద్ధంగా ఉండు నిమిత్తం ఈ ఆగమన కాలాన్ని ఉపయోగిస్తూ మనకు పాఠాన్ని నేర్పిస్తుంది.

 

ప్రవక్త మలాకీ దేవుని రెండు రాకడల గురించి మాట్లాడుతాడు.  మొదటిగా “మనం (నీవు) వెతుకుతున్న ప్రభువు తన ఆలయానికి అకస్మాత్తుగా వస్తాడు” (మలా 3:1) అని మొదటి రాకడ గురించి మాట్లాడుతూ, “చూడు! సర్వశక్తిమంతుడైన ప్రభువు వస్తాడు, ఆయన ప్రవేశించే రోజును సహిస్తాడు... కానీ ఆయన దృష్టిలో ఎవరు నిలబడగలరు? (మలా 3:2) అని రెండవ రాకడ గురించి   హెచ్చరిస్తున్నాడు. ఆయన శుద్ధి చేసే అగ్నివలే, ప్రతి మరకను శుభ్రపరిచే ఒక దర్బలు వలె వస్తాడు. భక్త పౌలున్నూ  తీతుకు ఈ రెండు రాకడల గురించి జగురూకతో వుండమని వ్రాస్తాడు. అది – రక్షకుడైన దేవుని కృప (యేసు ప్రత్యక్షత) అందరికీ కనిపించిందనీ, ఈ ప్రస్తుత యుగంలో భక్తిహీనత మరియు లోక కోరికలను పక్కనపెట్టి, నిగ్రహంగా, నిజాయితీగా మరియు ఆధ్యాత్మికంగా జీవించమని అందరికీ సూచించిందనీ, (మరియు) ఆనందకరమైన ఆశ కోసం, మన గొప్ప దేవుడు మరియు రక్షకుడు అయిన యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షత కోసం ఇంకా ఎదురు చూస్తున్నాము అని తీతుకు హెచ్చరిక చేశాడు (తీతు 2:11-14).

 

ఇటువంటి రెండు రాకడలు మన రక్షకునికి సంబంధించిన రెండు అంశాలను గురించి మాట్లాడుతున్నాయి. మొదటి రాకడలో, యుగాలకు ముందు దేవునితో ఉన్నవాడుగాన్నూ, కాలం పరి పూర్తి అయినప్పుడు కన్యక నుండి జన్మించి పశువుల తొట్టిలో పురుటి వస్త్రాలతో చుట్టబడి యున్నాడు. తన రెండవ రాకడలో,  వస్త్రంను ధరించుకున్నాట్లు  తేజో మయుడైన భానుడి వెలుగును అతను ధరించుకుంటాడు. మొదటి రాకడలో, అవమానాన్ని తృణీకరించి, ఆయన శిలువను భరించాడు; రెండవ రాకడలో, ఆయన దేవదూతల సైన్యంతో పాటు మహిమలో ఉంటాడు. మొదటి రాకడలో మనం, "ప్రభువు నామమున వచ్చువాడు ధన్యుడు" అని దూతల గణములు శ్లాఘించగా, రెండవ రాకడలో, ఆయన తీర్పు తీర్చబడటానికి కాకుండా, మనల్ని తీర్పు తీర్చడానికి వస్తాడు.

"ఆ గడియ గురించి దేవదూతలకు గానీ, కుమారునికి గానీ తెలియదు" అని యేసు చెప్పాడు (మత్త 24:36). ఆ ఉగ్ర రాకడ సమయాలను లేదా క్షణాలను తెలుసుకోవడం మన పని కాదు. మనం జాగ్రత్తగా ఉండేలా ఆయన ఆ విషయాలను దాచిపెట్టాడు. ఆయన తన రాకడ సమయాన్ని వెల్లడించి ఉన్నట్లయితే, ఆయన రాకడలో దాగి యున్న మహిమోపేత కరుణా రహస్యాన్ని కోల్పోయేది.

 

జాగ్రత్తగా ఉండండి. దేహం నిద్రపోతున్నప్పుడు, ప్రకృతి మనపై నియంత్రణ తీసుకుంటుంది. లోతైన నిర్లక్ష్యం ఆత్మను స్వాధీనం చేసుకున్నప్పుడు, (ఉదాహరణకు మూర్ఖత్వం లేదా విచారం), శత్రువు అయిన సాతాను దానిని అధిగమించి, తాను చేయలేని దానిని చేయమని మనలను బలోపేతం చేస్తాడు. ప్రకృతి శక్తి, ఆత్మ శత్రువు అయిన సైతాను నియంత్రణలో ఉంటుంది. ప్రభువు మనల్ని అప్రమత్తంగా ఉండమని ఆజ్ఞాపించండలో, మన ఆత్మశరీరంలో అప్రమత్తంగా వుండమని జ్ఞాపకం చేయడమే! ఆ రెండింటిలోనూ మనం నిద్రపోయే ధోరణి లేకపోలేదు! ఆత్మలో పిరికితనానికి, శరీరంలో బద్ధకానికి వ్యతిరేకంగా వుంటూ  అప్రమత్తంగా ఉండాలని అర్థం. పితృ పాదులు పునీత ఎఫ్రాయిము, కీర్తన 138లోని, "నీవు న్యాయంగా మేల్కొనుము, నేను లేచాను, మరియు ఇంకా నీతోనే ఉన్నాను” అనే అభయ వాక్యాన్ని ఉటంకిస్తూ “ఇక నిరుత్సాహపడకు” (ప్రక 1:8) అన్న దర్నన గ్రంథ వాక్య ధైర్యాన్ని అందిస్తున్నాడు. కాబట్టి మెళకువతో వుంటూ ప్రభువు రాకడను కొనియడుదాము.

 

"...ఇదిగో! మీ రాజు మీ దగ్గరకు వస్తున్నాడు. సీయోనూ, భయపడకు: నీ రక్షణ సమీపించియున్నది.”